శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-1


నైష్కర్మ్యసిద్ధిః


అథ ప్రథమోఽధ్యాయః


ఆబ్రహ్మస్తంబపర్యంతైః సర్వప్రాణిభిః సర్వప్రకారస్యాపి
దుఃఖస్య స్వరసత ఏవ జిహాసితత్వాత్తన్నివృత్త్యర్థా
ప్రవృత్తిరస్తి స్వరసత ఏవ

1-1



1-1

13 comments:

  1. అవతారిక: శ్రీ మచ్ఛంకరభగవత్పాదులవారి శిష్యులలో మెదటివారగు శ్రీ సురేశ్వరాచార్యులు తనగురువుచే నాజ్జపింపబడి యెక్క వేదాంతి ప్రకరణమునుజేయగోరెను.

    ReplyDelete
  2. 1. అవతారిక. శ్రీ శ్రీ మచ్చంకరాచార్య భగవత్పాదుల వారి శిష్యులలో మొదటివారగు శ్రీ సురేశ్వరాచార్యులు తన గురువు చే
    నాజ్ఞాపించ బడి యొక్క వేదాంత ప్రకరణమును జేయగోరెను. ఆ ప్రకరణమున కధికారి ,ప్రయోజన ,సాధన, విషయ, సంబంధములని నైదింటిని ముందుగా చెప్పుచున్నారు. అధికారి యన నీ గ్రంథమును జదువ యోగ్యుండైన పురుషుడు; ప్రయోజనమున పురుషునకు గలుగు ఫలము; సాధనమున నా ఫలము లభించుటకు దగు నుపాయము; విషయమున నీ గ్రంథము చే జెప్పబడునర్థము; సంబంధమన మీ గ్రంథమునకును నధికారి విషయ ప్రయోజన సాధనములకు నన్యోన్యము గల యనుబంధము ఈ ఐదింటిలో ముందుగా నధికారిని
    నిరూపించుకున్నారు.---

    ReplyDelete
  3. దండాన్వయము, బ్రహ్మ మొదలు పిపీలిక ఎరుక గల జంతువుల చే సర్వ విధమగు దుఃఖము స్వభావము గనే విడువ వలసిన దని శోద బడుచున్నందున నా దుఃఖము నివర్తించుట కొరకు దగిన నడవడిక స్వభావముగనే కలిగియుండును.

    ReplyDelete
  4. తాత్పర్యం. బ్రహ్మ మొదలుకొని యల్ప జంతువైన చీమ వరకు నీ లోకములో నుండు జంతువులన్నియు నాధ్యాత్మికాధిభౌతికాధిదైవికము లను దుఃఖములు లేక పోవలయునని సహజముగా గోరుచుండును. కాన నాదుఃఖములు నివర్తించు ప్రయత్నమును సహజముగ చేయు చుండును. అనగా శాస్త్రజన్యజ్ఞానమును గోరకయే దుఃఖమును పోగొట్టగలది యగుయుపాయముల వెదుకుచుండునని భావము. ఆధ్యాత్మికమని, ఆధిదైవిక మని, ఆధిభౌతికమని దుఃఖము మూడు విధములు; ద్వారా

    ReplyDelete
  5. తిసారాదిరోగములచే నగు దుఃఖ మాధ్యాత్మికము; అతి వాతాతి వర్షణములచే నగుదుఃఖ మాధిదైవికం; శత్రువ్యాఘృవృశ్చికాదులచే నగు దుఃఖ మాధి భౌతికము. ఈ త్రివిధ దుఃఖము మరల యతీతము,అనాగతము ,వర్తమానమని యొక్కొక్కటియు
    మూడు విధములుగా నున్నది.గతించి పోయిన దుఃఖ మతీతము; రాబోవు దుఃఖ మనాగతము;అప్పుడనుభవింపబడుచుండుదుఃఖము వర్తమానము అని చెప్పబడును. వీనిలో నతీత దుఃఖము పూర్వముననే గతించిపోయినందుచే దానిని వృత్తి కొరకు యత్నము చేయ నక్కర లేదు .వర్తమాన దుఃఖ మనుభవింపనిది నివృత్తికానందున దాని నివృత్తి కొరకును యత్నమక్కరలేదు. అనాగతదుఃఖము మాత్రము భయమును గలుగజేయుచుండు గాన నా దుఃఖమును సంభవింపనీయక బ్రయత్న మవశ్యముగ జేయదగును. దానినే లోకమున అందరును చేయు చుందురు .కాన సర్వదుఃఖనివృత్తిని గోరియుండు వార లీగ్రంథమున అధికారులని భావము.ఇందుచే సర్వదుఃఖ నివృత్తియే ఈ ప్రకరణము
    నకు ప్రయోజనమని సూచింపబడెను.

    ReplyDelete
  6. అవతారిక: శ్రీ మచ్ఛంకరభగవత్పాదులవారి శిష్యులలో మెదటివారగు శ్రీ సురేశ్వరాచార్యులు తనగురువుచే నాజ్ఞాపింపబడి యెక్క వేదాంతి ప్రకరణమునుజేయగోరెను.

    ReplyDelete
  7. 1. అవతారిక. శ్రీ శ్రీ మచ్చంకరాచార్య భగవత్పాదుల వారి శిష్యులలో మొదటివారగు శ్రీ సురేశ్వరాచార్యులు తన గురువు చే
    నాజ్ఞాపించ బడి యొక్క వేదాంత ప్రకరణమును జేయగోరెను. ఆ ప్రకరణమున కధికారి ,ప్రయోజన ,సాధన, విషయ, సంబంధములని నైదింటిని ముందుగా చెప్పుచున్నారు. అధికారి యన నీ గ్రంథమును జదువ యోగ్యుండైన పురుషుడు; ప్రయోజనమన నాపురుషునకు గలుగు ఫలము; సాధనమున నా ఫలము లభించుటకు దగునుపాయము; విషయమన నీ గ్రంథము చే జెప్పబడునర్థము; సంబంధమన నీగ్రంథమునకును, నధికారి విషయ ప్రయోజన సాధనములకు నన్యోన్యము గల యనుబంధము. ఈ ఐదింటిలో ముందుగా నధికారిని
    నిరూపించుచున్నారు.---

    ReplyDelete
  8. దండాన్వయము: బ్రహ్మ మొదలు పిపీలికం వరకు
    గల జంతువుల చే సర్వ విధమగు దుఃఖము స్వభావము గనే విడువవలసిన దని కోర బడుచున్నందున నాదుఃఖము నివర్తించుట కొరకు దగిన నడవడిక స్వభావముగనే కలిగియుండును.

    Reply

    ReplyDelete
  9. తాత్పర్యం. బ్రహ్మ మొదలుకొని యల్ప జంతువైన చీమ వరకు నీ లోకములో నుండు జంతువులన్నియు నాధ్యాత్మికాధిభౌతికాధిదైవికము లను దుఃఖములు తమకు లేక పోవలయునని సహజముగా గోరుచుండును. కాన నాదుఃఖములు నివర్తించు ప్రయత్నమును సహజముగ చేయుచుండును. అనగా శాస్త్రజన్యజ్ఞానమును గోరకయే దుఃఖమును పోగొట్టగలది యగుయుపాయముల వెదుకుచుండునని భావము. ఆధ్యాత్మికమని, ఆధిదైవికమని, ఆధిభౌతికమని దుఃఖము మూడు విధములు;

    ReplyDelete
  10. జ్వర అతిసారాది రోగములచే నగు దుఃఖ మాధ్యాత్మికము; అతి వాతాతి వర్షణములచే నగుదుఃఖ మాధిదైవికం; శత్రువ్యాఘృవృశ్చికాదులచే నగు దుఃఖ మాధి భౌతికము. ఈ త్రివిధ దుఃఖము మరల యతీతము,అనాగతము ,వర్తమానమని యొక్కొక్కటియు
    మూడు విధములుగా నున్నది.గతించి పోయిన దుఃఖ మతీతము; రాబోవు దుఃఖ మనాగతము;అప్పుడనుభవింపబడుచుండు దుఃఖము వర్తమానము అని చెప్పబడును. వీనిలో నతీత దుఃఖము పూర్వముననే గతించిపోయినందుచే దాని నివృత్తి కొరకు యత్నము చేయ నక్కర లేదు .వర్తమాన దుఃఖ మనుభవింపనిది నివృత్తికానందున దాని నివృత్తి కొరకును యత్నమక్కరలేదు. అనాగతదుఃఖము మాత్రము భయమును గలుగజేయుచుండు గాన నా దుఃఖమును సంభవింపనీయక బ్రయత్న మవశ్యముగ జేయదగును. దానినే లోకమున అందరును చేయు చుందురు .కాన సర్వదుఃఖనివృత్తిని గోరియుండు వార లీగ్రంథమున అధికారులని భావము.ఇందుచే సర్వదుఃఖ నివృత్తియే ఈ ప్రకరణము
    నకు ప్రయోజనమని సూచింపబడెను.

    ReplyDelete
  11. అవ."ఓయి! జ్వరము అతిసారము మొదలగు రోగాదులచే గలుగు ఆధ్యాత్మిక దుఃఖమును
    వైద్యశాస్త్రముసందు చెప్పబడియుండు
    ఔషధములు పోగొట్టును. శత్రు వ్యాఘ్రాదిజంతువులచే గలుగు నాధిభౌతికదుఃఖమును, పురుషుని యొక్క కాలోచిత మైన నేర్పు పోగొట్టును. అతివాతాతివర్షనాణాదులచే గలుగు నాది దైవిక దుఃఖమును శాంతికపౌష్టికాది కర్మలు పోగొట్టును. కాన నీ ప్రకరణంబుచే ప్రయోజన మేమియు గానం బడదు." అని పూర్వ పక్షనాది యాక్షేపించునని సిద్ధాంత వాధి యాత్యంతిక ం దుఃఖము ఈ ప్రకరణమున చెప్పబడు నాత్మతత్వ జ్ఞానముచే దప్ప ఇతర సాధనములచే పోగొట్ట బడనేరదని చెప్పుచున్నారు.---

    ReplyDelete
  12. అవ."ఓయి! జ్వరము అతిసారము మొదలగు రోగాదులచే గలుగు ఆధ్యాత్మిక దుఃఖమును
    వైద్యశాస్త్రముసందు చెప్పబడియుండు
    ఔషధములు పోగొట్టును. శత్రు వ్యాఘ్రాదిజంతువులచే గలుగు నాధిభౌతికదుఃఖమును, పురుషుని యొక్క కాలోచిత మైన నేర్పు పోగొట్టును. అతివాతాతివర్షనాణాదులచే గలుగు నాది దైవిక దుఃఖమును శాంతికపౌష్టికాది కర్మలు పోగొట్టును. కాన నీ ప్రకరణంబుచే ప్రయోజన మేమియు గానం బడదు." అని పూర్వ పక్షనాది యాక్షేపించునని సిద్ధాంత వాధి యాత్యంతిక ం దుఃఖము ఈ ప్రకరణమున చెప్పబడు నాత్మతత్వ జ్ఞానముచే దప్ప ఇతర సాధనములచే పోగొట్ట బడనేరదని చెప్పుచున్నారు.---

    ReplyDelete
  13. అవ."ఓయి! జ్వరము అతిసారము మొదలగు రోగాదులచే గలుగు ఆధ్యాత్మిక దుఃఖమును
    వైద్యశాస్త్రమునందు చెప్పబడియుండు
    ఔషధములు పోగొట్టును. శత్రు వ్యాఘ్రాదిజంతువులచే గలుగు నాధిభౌతికదుఃఖమును, పురుషుని యొక్క కాలోచిత మైన నేర్పు పోగొట్టును. అతివాతాతివర్షనాణాదులచే గలుగు నాది దైవిక దుఃఖమును శాంతికపౌష్టికాది కర్మలు పోగొట్టును. కాన నీ ప్రకరణంబుచే ప్రయోజన మేమియు గానం బడదు." అని పూర్వ పక్షవాది యాక్షేపించునని సిద్ధాంత వాది యాత్యంతిక ం దుఃఖము ఈ ప్రకరణమున చెప్పబడు నాత్మతత్వ జ్ఞానముచే దప్ప ఇతర సాధనములచే పోగొట్ట బడనేరదని చెప్పుచున్నారు.---

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.